Kuppam: పట్టాలు తప్పిన డబుల్‌ డెక్కర్‌ రైలు.. రాకపోకలకు అంతరాయం

చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బిసానత్తం రైల్వేస్టేషన్‌ సమీపంలో డబుల్‌డెక్కర్‌ రైలు పట్టాలు తప్పింది.

Updated : 15 May 2023 13:54 IST

కుప్పం పట్టణం: చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బిసానత్తం రైల్వేస్టేషన్‌ సమీపంలో డబుల్‌డెక్కర్‌ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ రైలు.. కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం వద్ద పట్టాలు తప్పడంతో వెంటనే లోకో పైలట్‌ అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గమనించి రైలును  నిలిపేయడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

ప్రస్తుతం ఈ రైలును క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డబుల్‌ డెక్కర్‌ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై-బెంగళూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బృందావన్‌ ఎక్స్‌ప్రెస్‌ను కుప్పం స్టేషన్‌ సమీపంలో.. బెంగళూరు కంటోన్మెంట్‌ స్పెషల్‌ రైలును తమిళనాడులోని జోలారుపేట జంక్షన్‌లో నిలపేశారు. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని