కాఫీ తాగేముందు ఆలోచించు గురూ!
‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’.. ‘ఆనంద్.. మంచి కాఫీ లాంటి సినిమా’.. అంటూ కాఫీ గురించి..
ఆరు కప్పులకు పైగా కాఫీ తాగితే మెదడుకు ముప్పే
‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’.. ‘ఆనంద్.. మంచి కాఫీ లాంటి సినిమా’.. అంటూ కాఫీ గురించి ఇన్నాళ్లు తియ్యగా మాట్లాడుకున్నాం. ఇకపై కాఫీ అతిగా తాగితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నాయి తాజా అధ్యయానాలు. మతిమరుపు, భాష మర్చిపోవడం, ఆలోచనా విధానం మందగించడం వంటి సమస్యలకు దారి తీస్తుందని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. వైద్య భాషల్లో దీన్నే ‘డెమెన్షియా’గా సంబోధిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ర్టేలియాలో పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం.. రోజుకి ఆరు, ఆపై కప్పుల కాఫీ తాగేవారిలో డెమెన్షియా వ్యాధి ముప్పు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి 17,702 మంది (37-73 వయసు) ఉన్నవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఆపై కాఫీ తాగడం వల్ల మెదడుకు కలిగే దుష్ర్పభావాలను పరిశీలించారు. అతిగా కాఫీ తీసుకునే వారిలో ఈ అనారోగ్యానికి దారి తీసినట్లు వారి ఫలితాల్లో తేలింది. ఈ వ్యాధి బారిన పడినట్లైతే.. రోజు చేసే పనుల మీద ప్రభావం చూపడమే కాదని.. ఒక్కోసారి మరణానికి సైతం దారి తీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచో) గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5కోట్ల మందికి డెమెన్షియాతో బాధపడుతున్నారని.. 2030 నాటికి ఈసంఖ్య.. 8కోట్లు, 2050 నాటికి 10కోట్లపైకి చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రాణాంతకరమైన ఈ వ్యాధికి ఎటువంటి చికిత్స అందుబాటులో లేదని, కాబట్టి నియంత్రణలో ఉండటమే మంచిదని డబ్యూహెచో సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM