తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ టీకా డ్రైరన్‌

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా 2 జిల్లాల్లోని 6 ప్రాంతాల్లో శనివారం డ్రైరన్‌ నిర్వహించారు.

Updated : 09 Dec 2023 16:21 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ టీకా పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా 2 జిల్లాల్లోని 6 ప్రాంతాల్లో శనివారం డ్రైరన్‌ నిర్వహించారు. హైదరాబాద్‌ జిల్లాలో తిలక్‌నగర్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాంపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, సికిం ద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిని ఎంపిక చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా కేంద్ర ఆసుపత్రి, ప్రైవేటులో నేహ షైన్‌ ఆసుపత్రిని ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో 25-30 మంది చొప్పున ఆరోగ్య సిబ్బందిని, సాధారణ పౌరులను ఎంపిక చేసి ఈ కార్యక్రమంలో భాగస్థులను చేశారు. కేంద్రంలోకి టీకా పొందే వ్యక్తి ప్రవేశించినప్పటి నుంచి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడం వరకూ అన్ని దశల ప్రక్రియలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.  టీకాను ఇవ్వడం మినహా ఇతర కార్యక్రమాలన్నింటినీ చేపట్టారు. 

కరోనా టీకా పంపిణీలో భాగంగా కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శనివారం డ్రైరన్‌ నిర్వహించారు. ఒక్కో జిల్లాలో మూడు చొప్పున ఎంపిక చేసిన 39 కేంద్రాల్లో ఈ డ్రైరన్‌ ప్రక్రియ కొనసాగింది. ఎంపిక చేసిన ఆరోగ్య కార్యకర్తల ఫోన్లకు శుక్రవారం రాత్రికే తెలుగులో సంక్షిప్త సందేశం వచ్చింది. మిగిలిన జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో మరోసారి డ్రై రన్‌ నిర్వహించారు. ప్రతి జిల్లా కేంద్రంలో తప్పనిసరిగా ఒక కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. అలాగే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని ఎంపికచేశారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి..
వెళ్లేముందు అభాసుపాలు!

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని