eamcet exam: ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎంసెట్(ఇంజినీరింగ్) పరీక్షను ఆగస్టు 4, 5, 6 తేదీల్లో... ఎంసెట్(అగ్రికల్చర్, మెడికల్) ప్రవేశ పరీక్షను ఆగస్టు 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది. కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రవేశ పరీక్షల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని సబిత వివరించారు.
ఫైనల్ ఇయర్ పరీక్షలు జులైలో పూర్తి చేయాలి
ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లమో ఫైనల్ ఇయర్ పరీక్షలను జులై మొదటి వారంలో ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని యూనివర్సిటీల అధికారులను మంత్రి ఆదేశించారు. విదేశాల్లోనూ, ఇతర చోట్ల ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారి సౌలభ్యం కోసం ఫైనల్ ఇయర్ పరీక్షలు త్వరగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని అందుకు అనుగుణంగానే జులై 1వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల బ్యాక్లాగ్లు కూడా జులైలోనే పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. అన్ని పరీక్షలు కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు.
టీఎస్ ప్రవేశ పరీక్షలు | పరీక్షలు జరగనున్న తేదీలు |
ఎంసెట్-ఇంజినీరింగ్ | 4,5, 6, ఆగస్టు 2021 |
ఎంసెట్-అగ్రికల్చర్, మెడిసన్ | 9, 10 ఆగస్టు, 2021 |
ఈసెట్ | 3 ఆగస్టు 2021 |
పీజీఈసెట్ | 11, నుంచి 14 ఆగస్టు 2021 |
ఐసెట్ | 19, 20 ఆగస్టు 2021 |
లాసెట్ | 23, ఆగస్టు 21 |
ఎడ్సెట్ | 24, 25 ఆగస్టు 2021 |
పాలీసెట్ | 17 జులై 2021 |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM