Delhi liquor case: మాగుంట రాఘవ్‌కు బెయిల్‌.. సుప్రీంకు ఈడీ

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు బెయిల్‌ మంజూరు చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Published : 08 Jun 2023 12:53 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవ్‌కు బెయిల్‌ మంజూరు చేయడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రయల్‌ కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తే దిల్లీ హైకోర్టు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ ఇచ్చిందని కోర్టు దృష్టికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ)  తీసుకొచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టి స్టే ఇవ్వాలని ఏఎస్‌జీ కోరారు. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు విచారణ చేపడతామని  జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ రమేశ్‌ బిందాల్‌తో కూడిన వెకేషన్‌ బెంచ్‌ తెలిపింది. 

మాగుంట రాఘవకు 15 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ బుధవారం దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ కోసం ఆయన చూపిన కారణాలు సరైనవి కావని.. సమీప బంధువుల ఆరోగ్యం బాగోలేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు వెకేషన్‌ బెంచ్‌ అంగీకారం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని