Pilot Rohit Reddy: ఏ కేసులో నన్ను పిలుస్తున్నారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.. రోహిత్ రెడ్డి
తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 6 గంటల పాటు ఆయన్ని ప్రశ్నించారు.
హైదరాబాద్: తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటలపాటు ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. మంగళవారం మరోసారి విచారణకు రావాలని కోరారు. ఈ సందర్భంగా రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మళ్లీ రేపు హాజరు కావాలని ఈడీ అఘధికారులు చెప్పారు. నా వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకున్నారు. నా కుటుంబ వివరాలూ అడిగారు. ఈడీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పా. ఏ కేసులో పిలుస్తున్నారనేది ఇప్పటికీ ఈడీ స్పష్టత ఇవ్వలేదు’’ అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఈడీ నోటీసుల్లో అడిగిన వివరాల సేకరణకు మరికొంత సమయం పడుతుందని.. దీని కోసం ఒక వారం గడువు ఇవ్వాలని ఆయన పీఏ శ్రవణ్ ద్వారా ఈడీ కార్యాలయానికి రోహిత్ లేఖ పంపించారు. కానీ గడువు ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో ప్రగతిభవన్కు వెళ్లిన రోహిత్ రెడ్డి తొలుత సీఎం కేసీఆర్ను కలిసిన అనంతరం ఈ మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సహాయ సంచాలకుడు దేవేందర్సింగ్ పేరిట శుక్రవారం అధికారులు రోహిత్రెడ్డికి సమన్లు జారీ చేశారు. రోహిత్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఆధార్, పాన్కార్డ్, పాస్పోర్ట్తో పాటు.. తనకు, తన కుటుంబానికి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, కంపెనీ వివరాలు తీసుకురావాలని కోరారు. ఆదాయపన్ను చెల్లింపులతో పాటు, ఇతర క్రయ విక్రయాలకు సంబంధించి గత ఏడేళ్ల సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్