
TS కరోనా: ‘కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువ’
తెలంగాణ మంత్రి ఈటల
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వర్క్స్పేస్ మెటల్ సొల్యూషన్స్ సంస్థ సంక్షేమశాఖకు అందజేసిన సెల్ఫ్ చెక్ కియోస్కి యంత్రాన్ని హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మంత్రులు ఈటల, కొప్పుల ఈశ్వర్ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ కరోనా దృష్ట్యా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అందరూ భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.