Andhra News: ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లోనూ ఈహెచ్‌ఎస్‌

ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్ఎస్) కార్డులపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవల కోసం అనుమతి ఇస్తూ రాష్ట్ర

Updated : 13 Aug 2022 15:37 IST

అమరావతి: ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్ఎస్) కార్డులపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్య సేవల కోసం అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద ఇప్పటివరకూ కవర్‌ కాని 565 వైద్య విధానాలను ఉద్యోగులకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యం చేసిన బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లోనే ఆటోడెబిట్‌ స్కీమ్‌ ద్వారా చెల్లింపులకు అంగీకారం తెలిపింది. విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకూ ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్‌ఎస్‌ కార్డుపై వైద్య సేవలు పొందేందుకు వీలుగా అనుమతి ఇచ్చారు.

మరోవైపు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ కార్డుల సమన్వయానికి ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగులకు సంబంధించిన ఈహెచ్‌ఎస్‌పై ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేసినందుకుగానూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేసిన మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడిగించేందుకు వీలుగా త్వరలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని