మావటికి అశ్రునివాళి అర్పించిన ఏనుగు

కంటికి రెప్పలా చూసుకున్న మావటికి, ఓ ఏనుగు అశ్రునివాళి అర్పించిన ఘటన కేరళలోని కొట్టాయంలో జరిగింది.

Updated : 05 Jun 2021 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటికి రెప్పలా చూసుకున్న మావటికి, ఓ ఏనుగు అశ్రునివాళి అర్పించిన ఘటన కేరళలోని కొట్టాయంలో జరిగింది. కూరప్పుడకు చెందిన ప్రసిద్ధ మావటి దామోదరన్‌ నాయర్ ఇటీవల మరణించారు. 60 ఏళ్లుగా ఆయన ఏనుగులను సంరక్షిస్తున్నారు. పల్లట్ బ్రహ్మదాతన్ అనే ఏనుగుకు పాతికేళ్లుగా ఆయన సంరక్షకుడిగా ఉన్నాడు. అతడికి ఆ ఏనుగుతో అవినాభావ సంబంధం ఏర్పడింది. దీంతో నాయర్ అంత్యక్రియల్లో ఆయన్ను కడసారి చూడటానికి వచ్చిన బ్రహ్మదాతన్ కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది. కేరళలో ప్రముఖ పండుగలకు నాయర్ మావటిగా వెళ్లేవారు. ఎంతోమందిని ఏనుగు సంరక్షకులుగా తీర్చిదిద్దిన దామోదరన్‌ నాయర్‌ పలు అవార్డులు సైతం పొందారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని