
జాతీయ రహదారిపై ఏనుగుల హల్చల్
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశా రాష్ట్రం కోర్దా జిల్లాలోని జాతీయ రహదారిపై రెండు ఏనుగులు హల్చల్ చేశాయి. దాలీపుర్ సమీపంలోని అడవిలోనుంచి రెండు గజరాజులు రహదారిపైకి వచ్చాయి. కలియ తిరుగుతూ రోడ్డును దిగ్బంధం చేశాయి. ఏనుగుల చేష్టలతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 2 గంటల పాటు రోడ్డు పైనే వేచి ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని గజరాజులను అడవిలోకి పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి...
కేటీఆర్ మెచ్చిన ఈ కుర్రాడి టాలెంట్ చూశారా..?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.