Elon Musk: ట్రంప్.. మీ యాప్ పేరు మార్చండి: ఎలాన్ మస్క్
తాజాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను సొంతం చేసుకున్న ఎలాన్మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన సోషల్మీడియా మాధ్యమం పేరు మార్చుకోవాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: తాజాగా 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను సొంతం చేసుకున్న ఎలాన్మస్క్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన సోషల్మీడియా మాధ్యమం పేరు మార్చుకోవాలని సూచించారు. ఆపిల్ స్టోర్లో అత్యధిక డౌన్లోడ్లు సాధించి మొదటి స్థానంలో ఉన్న ‘ట్రూత్ సోషల్’ యాప్ పేరును ‘ట్రంపెట్’ గా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ‘ట్విటర్లో భావప్రకటనల విషయంలో నియంత్రణలు విధించిన కారణంగానే ‘ట్రూత్ సోషల్’ అనే యాప్ పుట్టుకొచ్చింది. దానిని ఇకపై ‘ట్రంపెట్’ గా పిలవండి.’అంటూ ట్విట్ చేశారు.ట్విటర్ జనవరిలో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను నిలిపివేసింది. దీంతో ఆయనే స్వయంగా ‘ట్రూత్ సోషల్’ అనే సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఫిబ్రవరి 2022 నుంచి యాపిల్ స్టోర్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్ ట్విటర్, టిక్టాక్ వంటి దిగ్గజ సంస్థల కంటే ఎక్కువ మంది యూజర్లను సొంతం చేసుకుంది. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు ఈ ‘ట్రూత్ సోషల్’లో నిజాయతీగా, బహిరంగంగా మాట్లాడుకోవచ్చు’అని ఈ యాప్ను రూపొందించినట్లు ట్రంప్ టీమ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
ట్విటర్ మస్క్ చేతిలోకి వచ్చాక ట్రంప్ను తిరిగి తన నెట్వర్క్లోకి తీసుకుంటారని అందరూ భావించారు. అయితే తన అకౌంట్ను పునరుద్ధరించినా.. తాను మాత్రం ట్విటర్ను ఉపయోగించనని, దానిపై తనకు ఆసక్తి లేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఓ ప్రకటనలో చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?