Kishan Reddy: హైదరాబాద్, విశాఖలో మ్యూజియంల ఏర్పాటు: కిషన్రెడ్డి
నగరంలోని పార్క్ హయత్ హోటల్లో రిమేజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా సమ్మిట్ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా
హైదరాబాద్: నగరంలోని పార్క్ హయత్ హోటల్లో రిమేజినింగ్ మ్యూజియమ్స్ ఇన్ ఇండియా సమ్మిట్ను కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ను జరుపుకొంటున్న తరుణంలో.. మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, శాశ్వతంగా కొనసాగించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారత దేశంలోని వెయ్యికి పైగా మ్యూజియంలు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గత ఏడేళ్లుగా కొత్త మ్యూజియంల నిర్మాణంపై దృష్టి సారించాం. ఇప్పటికే ఉన్న మ్యూజియంలను కొత్త తరానికి అనువుగా ఉండేలా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సమరయోధుల పేరుతో 10 నూతన మ్యూజియంలను కేంద్రం ఏర్పాటు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో మ్యూజియంలను ఏర్పాటు చేస్తున్నాం’’ అని కిషన్రెడ్డి తెలిపారు.
‘‘ఏపీలో 6, తెలంగాణలో 5 కొత్త మ్యూజియంలకు గ్రాంట్ ఇస్తాం. ఇప్పటికే రూ.కోటి రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేశాం. ఏపీలో రూ.35 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. అల్లూరి జయంతి రోజున ప్రారంభిస్తాం. హైదరాబాద్కు కేంద్రం సైన్స్ సిటీని మంజూరు చేసింది. సైన్స్ సిటీకి 25 ఎకరాల స్థలం కేటాయించాలని సీఎంకు లేఖ రాశాం. రాష్ట్ర ప్రభుత్వం నిజాం నగలను భద్ర పరిచేందుకు భవనం కేటాయిస్తే తీసుకురావడానికి మాకు అభ్యంతరం లేదు’’ అని కిషన్రెడ్డి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్