నాడు దేశం కోసం.. నేడు పొట్టకూటి కోసం..
ఒకప్పుడు దేశం కోసం పోరాడిన ఆ సైనికుడు ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు పోరాడుతున్నాడు. తుపాకీ పట్టుకొని దాయాది దేశంతో యుద్ధం చేసిన ఆయన బతుకుబండిని లాగడానికి ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు....
కుటుంబ పోషణకు తంటాలు పడుతున్న మాజీ సైనికాధికారి
హైదరాబాద్: ఒకప్పుడు దేశం కోసం పోరాడిన ఆ సైనికుడు ప్రస్తుతం కుటుంబాన్ని పోషించేందుకు పోరాడుతున్నాడు. తుపాకీ పట్టుకొని దాయాది దేశంతో యుద్ధం చేసిన ఆయన బతుకుబండిని లాగడానికి ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు. ఏడు పదుల వయసులో పొట్టకూటి కోసం కష్టాలుపడుతున్నాడు. హైదరాబాద్లోని మంగళ్హాట్కు చెందిన షేక్ అబ్దుల్ కరీం ఓ మాజీ సైనికాధికారి. తండ్రి ఫరీద్ అప్పటికే ఆర్మీలో ఉండటంతో ఆయన ప్రోత్సాహంతో 1967లో సైన్యంలో చేరారు. ఆపరేషన్ రేడియో ఆర్టిలరీలో గన్నర్గా పనిచేశారు. 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. సైన్యంలో తొమ్మిదేళ్లు పనిచేశారు. అయితే పెన్షన్ లభించడం లేదు. ప్రస్తుతం భార్య సుల్తానాతో కలిసి రాజేంద్రనగర్లో నివాసముంటున్నారు.
అబ్దుల్ కరీంకు ఆరుగురు సంతానం కాగా వారందరికి వివాహం చేశారు. తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవాల్సిన కుమారుల పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో రోజు గడవడం కష్టంగా మారింది. రుణం తీసుకొని ఆటో కొనుక్కున్న కరీం ఏడేళ్లుగా రాజేంద్రనగర్ పరిధిలో ఆటో నడుపుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు.
భువనగిరి పరిధిలోని వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామంలో కరీంకు ఐదెకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ దస్తావేజులు ఇవ్వలేదు. ఆ భూమి ఇంకొకరి పేరుతో రిజిస్టర్ చేశారు. దానికి బదులుగా మరోచోట భూమి ఇస్తామన్న అధికారులు స్పందించడం లేదని కరీం వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు