చైనా ఖాతాలు తొలగించిన ఫేస్బుక్
నకిలీ ఖాతాలు, ఫేస్బుక్ పేజీలు ఉన్న చైనాకు చెందిన నెట్వర్క్ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తొలగించింది. అమెరికా సహా ఇతర దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపరిచేలా ఈ ఖాతాలు ఉన్నాయని ఫేస్బుక్ వెల్లడించింది
ఇంటర్నెట్ డెస్క్: నకిలీ ఖాతాలు, ఫేస్బుక్ పేజీలు ఉన్న చైనాకు చెందిన నెట్వర్క్ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ తొలగించింది. అమెరికా సహా ఇతర దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపరిచేలా ఈ ఖాతాలు ఉన్నాయని ఫేస్బుక్ వెల్లడించింది. ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్ దేశాల రాజకీయాలపైనే ప్రధానంగా ఈ నెట్వర్క్ దృష్టి సారించినట్లు తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి జోబైడెన్లకు వ్యతిరేకంగా, మద్దతుగా ఈ ఖాతాల్లో పోస్టులు చేసినట్లు పేర్కొంది. చైనా ప్రభుత్వంతో ఈ నెట్వర్క్కు సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయం ఫేస్బుక్ వెల్లడించలేదు. ప్రైవేటు నెట్వర్క్లు, ఇతర పద్ధతుల ద్వారా ఈ ఖాతాలను నిర్వహించిన వ్యక్తులు తమ వివరాలను దాచినట్లు తెలిపింది. మరోవైపు విదేశాలకు చెందిన వ్యక్తులు, సైబర్ నేరగాళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసేందుకు, ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఎఫ్బీఐ సహా హోంలైన్ సెక్యూరిటీస్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే