Andhrapradesh: అయ్యో.. గర్భిణికి వైద్యం నిరాకరించిన వైద్యులు..!
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
అనంతపురం: అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన గర్భిణి పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలి బందువులు ఆరోపిస్తున్నారు. సత్యసాయి జిల్లా కదిరి పరిధిలోని మరువతండాకు చెందిన శ్రీవాణి భర్తతో కలిసి బుదవారం సాయంత్రం మోటారు సైకిల్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గర్భిణి అయిన శ్రీవాణి గాయపడింది. చికిత్స కోసం కదిరి ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయానికి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న శ్రీవాణికి చికిత్స అందించేందుకు అక్కడి వైద్య సిబ్బంది నిరాకరించారని శ్రీవాణి బంధువులు ఆరోపిస్తున్నారు. గర్భిణి అని కూడా చూడకుండా ఆస్పత్రి నుంచి బయటకు వెళ్లిపొమ్మన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ