Kamareddy: కలెక్టరేట్లోకి దూసుకెళ్లిన రైతులు.. కానిస్టేబుల్ సహా పలువురికి గాయాలు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ వద్ద రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణ నూతన మాస్టర్ప్లాన్కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
కామారెడ్డి: కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కుటుంబాలతో సహా రైతులు పట్టణంలోని సీఎస్ఐ మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. దీంతో ఆ పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ధర్నా నిర్వహించిన రైతులు ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుంటూ కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లారు. గేటుకు వేసిన తాళం తొలగించారు. పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. కొందరు రైతులు పోలీసులను తప్పించుకుని గోడ దూకి కలెక్టరేట్లోకి దూసుకెళ్లారు. వారిని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఇద్దరు మహిళా రైతులు సొమ్మసిల్లి పడిపోగా, ఒక రైతుకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రైతులతో కలిసి బైఠాయించిన భాజపా ఎమ్మెల్యే
కామారెడ్డిలో రైతుల ఆందోళన న్యాయమైనదేనని భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. రైతులతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్గా మారిస్తే వ్యవసాయానికి అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వ భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములను మాత్రమే పరిశ్రమలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత రైతుల భూములను ఇండస్ట్రియల్ జోన్ నుంచి తక్షణమే తొలగించాలన్నారు. ప్రజాసమస్యలపై మాట్లాడదామంటే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదని విమర్శించారు. పటాన్ చెరు ప్రాంతంలో ఇండస్ట్రియల్ జోన్లను రెసిడెన్షియల్ జోన్లుగా మారుస్తున్న ప్రభుత్వం.. కామారెడ్డిలో పంట పొలాలను ఎందుకు ఇండస్ట్రియల్ జోన్లుగా మారుస్తున్నారని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి