Kamareddy: మాస్టర్ప్లాన్ను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన.. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణ నూతన మాస్టర్ప్లాన్ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు
కామారెడ్డి పట్టణం: కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పట్టణ నూతన మాస్టర్ప్లాన్ను వ్యతిరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. కుటుంబాలతో సహా పట్టణంలోని సీఎస్ఐ మైదానం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా చేపట్టారు. దీంతో ఆ పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాటిని తోసుకుంటూ కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు రైతులు యత్నించారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి కలెక్టరేట్ గేటు వద్ద వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాగు భూములను పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?