Andhra News: కాకినాడలో రైతుపోరుబాట ఉద్రిక్తం
ధాన్యం కొనుగోళ్లు జరపాలంటూ కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరుబాట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
కాకినాడ: ధాన్యం కొనుగోళ్లు జరపాలంటూ కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరుబాట కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలుగుదేశం కార్యాలయం నుంచి కలెక్టరేట్కు రైతులు భారీ ర్యాలీగా వెళ్తుండగా.. కాకినాడ జడ్పీ సెంటరు వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులు, తెదేపా శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తీవ్రంగా తోపులాట జరగడంతో ఓ రైతు సొమ్మసిల్లి పడిపోయాడు.
దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నా లెక్క చేయకుండా.. రైతులు బారికేడ్లు తోసుకుని కలెక్టరేట్ వైపు దూసుకెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని, నష్ట పరిహారం చెల్లించాలని గత కొన్ని రోజులుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. జడ్పీ సెంటరు నుంచి పోలీసులను తోసుకుంటూ ముందుకు సాగిన రైతులు కలెక్టరేట్ వద్దకు చేరుకుని గేటు బయట ధర్నాకు దిగారు. కలెక్టర్ బయటకు వచ్చి వినతిపత్రం తీసుకోవాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళనలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, వర్మ, మాజీ జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్, తెదేపా రైతు విభాగం నాయకుడు శీనుబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు