Satyavathi Rathod: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి ఇంట విషాదం..

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుగులోత్ లింగ్యానాయక్ కన్నుమూశారు.

Published : 17 Feb 2022 19:01 IST

మహబూబాబాద్‌: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గుగులోత్ లింగ్యానాయక్ కన్నుమూశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో తెల్లవారుజామున మృతిచెందారు. మేడారం జాతర పర్యవేక్షిస్తున్న మంత్రి.. తండ్రి మరణవార్త విని హుటాహుటిన బయలుదేరారు. ఆయన పార్థీవదేహం వద్ద కంటతడిపెట్టారు. లింగ్యానాయక్ మృతిపట్ల పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి సత్యవతి రాథోడ్‌ను పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని