Festival mela: నాంపల్లిలో ఫెస్టివల్‌ మేళా ప్రారంభం

దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లిలో ఫెస్టివల్‌ మేళా ప్రారంభమైంది. ఈ మేళాను తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో...

Updated : 11 Oct 2021 19:13 IST

హైదరాబాద్‌: దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లిలో ఫెస్టివల్‌ మేళా ప్రారంభమైంది. ఈ మేళాను తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఈ నెల 31వరకు ఈ ఫెస్టివల్‌ మేళా కొనసాగనుంది. దీంట్లో 300 స్టాల్స్‌ ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ వెల్లడించింది. ఈ ఏడాదీ నుమాయిష్‌ లేనందున ఫెస్టివల్‌ మేళా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చిన్న పరిశ్రమలు, చేతివృత్తుల వారికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. మేళాలో హ్యాండ్లూమ్‌, కశ్మీర్‌ ,రాజస్థానీ వస్త్రాలు, ఫుడ్‌ కోర్టులు, కిడ్స్‌ గేమ్స్‌ ఉంటాయని సొసైటీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని