Andhra News: పట్టాలపై రాళ్లు.. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్‌ వద్ద కొంత మంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లు పెట్టారు. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచి వెళ్లడంతో రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి....

Updated : 01 Apr 2022 22:51 IST

ధర్మవరం: తిరుపతి-అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా ధర్మవరం పరిధిలోని కదిరి గేట్‌ వద్ద కొంత మంది గుర్తు తెలియని దుండగులు పట్టాలపై రాళ్లు పెట్టారు. పట్టాలపై ఉంచిన రాళ్ల పైనుంచి వెళ్లడంతో రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఇంజిన్‌లో మంటలు రావడంతో అమరావతి ఎక్స్‌ప్రెస్‌ గంటపాటు నిలిచిపోయింది. మరో ఇంజిన్‌ జోడించిన తర్వాత రైలు బయలుదేరి వెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరక్కపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని