Telangana News: పౌరసరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్క్ సమీపంలోని పౌరసరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 13 లక్షల గోనె సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సిరిసిల్ల రూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్క్ సమీపంలోని పౌరసరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన గోదాంలో సుమారు 13 లక్షల గోనె సంచులను నిల్వ ఉంచారు. ప్రమాదవశాత్తు గోదాంలోని గోనెసంచులకు నిప్పంటుకొని గోదాంలో నిలువ ఉంచిన మొత్తం సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సిరిసిల్ల తహసీల్దార్ విజయ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై లక్ష్మారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సతీష్ రావు ఘటనా స్థలానికి చేరుకొని క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!