Telangana News: పౌరసరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్‌టైల్‌ పార్క్ సమీపంలోని పౌరసరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు 13 లక్షల గోనె సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Published : 25 Oct 2022 02:47 IST

సిరిసిల్ల రూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్‌టైల్‌ పార్క్ సమీపంలోని పౌరసరఫరాల శాఖ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన గోదాంలో సుమారు 13 లక్షల గోనె సంచులను నిల్వ ఉంచారు. ప్రమాదవశాత్తు గోదాంలోని గోనెసంచులకు నిప్పంటుకొని గోదాంలో నిలువ ఉంచిన మొత్తం సంచులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో భారీగా నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సిరిసిల్ల తహసీల్దార్‌ విజయ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి, రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై లక్ష్మారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సతీష్ రావు ఘటనా స్థలానికి చేరుకొని క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని