Fire Accident: ఒంగోలులో ఎనిమిది ప్రైవేటు బస్సులు దగ్ధం

ప్రకాశం జిల్లా ఒంగోలులో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఉడ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో మంటలు చెలరేగాయి.

Updated : 01 Mar 2022 12:31 IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని ఉడ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలో పార్కింగ్‌ చేసిన ఎనిమిది ప్రైవేటు బస్సులు దగ్ధమయ్యాయి. కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులుగా వీటిని గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. మంటల ధాటికి దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు