TTD: తితిదే ధర్మరథం బస్సులో మంటలు... ఘాట్‌రోడ్‌లో తప్పిన ప్రమాదం

తిరుమల ఎగువ కనుమదారిలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న తితిదే ధర్మరథం బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Updated : 26 Mar 2022 18:18 IST

తిరుమల: తిరుమల ఎగువ కనుమదారిలో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి నుంచి తిరుమలకు వస్తున్న తితిదే ధర్మరథం బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును లింక్‌రోడ్డు సమీపంలో నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో భక్తులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని