Fire Accident: రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం..ఎగిసిపడిన మంటలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం శివారులోని ఆగ్రో కెమికల్స్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని

Updated : 12 Aug 2021 12:50 IST

చౌటుప్పల్‌ గ్రామీణం: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం శివారులోని ఆగ్రో కెమికల్స్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని షెడ్డుకు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కార్మికులు వెంటనే బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్‌, రామన్నపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నారు. విషయం తెలుసుకున్న చౌటుప్పల్‌ పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని