Crime news: పెళ్లి ఊరేగింపులో అపశ్రుతి.. వరుడి గుర్రపు బండికి మంటలు!

గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో ఓ వివాహ ఊరేగింపులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శోభాయాత్రలో వరుడి గుర్రపు బండి మంటల్లో

Published : 16 Dec 2021 01:01 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహ ఊరేగింపులో వరుడి గుర్రపు బండి మంటల్లో చిక్కుకుంది. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. ప్రమాదం నుంచి వరుడితో పాటు చిన్నారులు ఎలాంటి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. బంధువులు, స్నేహితుల నృత్యాల మధ్య శోభాయాత్రగా పెళ్లి మండపానికి గుర్రపు బగ్గీలో వరుడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టపాసులు కాలుస్తూ సందడి చేస్తూ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా గుర్రపు బండిలో మంటలు చెలరేగాయి. బండి నుంచి గుర్రాలను విడదీసి, నీటిని చల్లి మంటలను ఆర్పి వేశారు. గుర్రపు బండిలో టపాసులు ఉంచగా.. వాటితోనే మంటలు అంటుకున్నట్లు భావిస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని