Health: ఆహారం కలుషితమై వాంతులు, విరేచనాలా..? అయితే ఇలా చేయండి..!
ఆహారం బలవర్ధకంగా ఉండాలి..అలాంటి ఆహారం ప్రాణాంతకంగా మారితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలను తీస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: మనం తినే ఆహారం బలవర్ధకంగా ఉండాలి. అలాంటి ఆహారం ప్రాణాంతకంగా మారితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలనూ తీస్తాయి. ఇలాంటి పరిస్థితిని చేజేతులా మనమే కొని తెచ్చుకుంటాం. వారాంతంలో రెస్టారెంటుకు వెళ్లాలనుకోవడం.. బజారులో లభించే ఛాట్ లాంటివి తినడం మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక వర్షకాలంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయించాలి. అది కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే సగం ఇబ్బందులను అధిగమించినట్లు అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
కలుషితం అయితే: మనం తినే ఆహారం సరిగా ఉడకకపోయినా.. సరిగా నిల్వ చేయకపోయినా కలుషితం అవుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు, ఆజీర్తి, పొట్ట ఉబ్బరం తలెత్తుతుంది. మనం తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, ఇతర నూనె పదార్థాల కారణంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
ఏం చేస్తే బాగుంటుంది: ఆహారం కలుషితం అయినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పొట్టలో ఇబ్బందులు తగ్గే వరకు పళ్ల రసాలను తీసుకోవాలి. నిమ్మరసం, పుదీనా జ్యూస్ తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది. తురిమిన అల్లం, కాస్తంత జీలకర్ర పొడిని మజ్జిగలో కలుపుకొని తరచుగా తాగాలి. దానిమ్మ గింజలకు పొట్టలోని బాధలను తగ్గించే గుణముంది. పెరుగు, నానబెట్టిన మెంతులు, బాగా మగ్గిన అరటిపండును తినడం మంచిదే. తులసి, బ్లాక్ టీ తాగడంతో కూడా ఫలితం ఉంటుంది. పొట్టలో బాధలు తగ్గే వరకూ నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. వాంతులు, విరేచనాల తీవ్రత అధికంగా ఉంటే వైద్యుల దగ్గరికి వెళ్లాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్