ఇంట్లో జిమ్... ఇవి ఉన్నాయా?
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యం, ప్రశాంతత ప్రతి ఒక్కరి ప్రాధాన్యం. ఇందుకోసం ఎక్కువ మంది ఆచరించే మార్గం జిమ్, యోగా సెంటర్లకు వెళ్లడమే.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆరోగ్యం, ప్రశాంతత ప్రతి ఒక్కరి ప్రాధాన్యం. ఇందుకోసం ఎక్కువ మంది అనుసరించే మార్గం జిమ్, యోగా సెంటర్లకు వెళ్లడమే. అయితే వైరస్ వ్యాప్తి భయంతో ఇంతకుముందులా జిమ్, యోగా సెంటర్లకు వెళ్లే అవకాశం ఇప్పుడు లేదు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటూ ఫిట్నెస్, యోగాపై దృష్టి కేంద్రీకరిస్తున్నవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. అయితే జిమ్, యోగా సెంటర్లకు వెళ్లినప్పటి మాదిరిగా ఫలితాలు రావాలంటే అందుకు అవసరమైన కొన్ని పరికరాలు మన ఇంటి జిమ్లో తప్పనిసరిగా ఉండాలంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం..
యోగా మ్యాట్: ఒక మంచి యోగా మ్యాట్ను వినియోగించడం ద్వారా ఆసనాలు వేసేటప్పుడు పట్టు సడలకుండా చూసుకోవచ్చు. తీవ్ర గాయాల బారిన పడకుండా ఇది రక్షిస్తుంది. అంతేకాదు శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. దీని వల్ల వివిధ యెగాసనాలు వేసేటప్పుడు అవసరమైన శక్తి మన శరీరానికి అందుతుంది.
డంబెల్ సెట్: కండలు పెంచాలంటే జిమ్లో ఉండాల్సిన ముఖ్యమైన సాధనం డంబెల్. శరీరంలో అవసరమైన చోట కండరాలు పరిపుష్టం కావాలంటే వీటిని కచ్చితంగా వినియోగించాల్సి ఉంటుంది. శరీరంలోని వివిద భాగాల్లోని కండరాల పెరుగుదలకు విభిన్న బరువులతో డంబెల్స్ను ఉపయోగించాలి.
స్కిప్పింగ్ రోప్(తాడు): మన ఇంటి జిమ్లో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనం స్కిప్పింగ్ రోప్. అంటే తాడు. దీంతో కార్డియో, ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలు చేసే వీలుంటుంది. స్కిప్పింగ్ చేయడం వల్ల కాళ్ల పిక్కలు బలంగా తయారవుతాయి. శారీరక సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
ఇండోర్ సైకిల్: మీ శరీరంలోని కొవ్వును తగ్గించుకోవాలనుకుంటున్నారా? మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నారా? కండరాల శక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇంటి జిమ్లో తప్పనిసరిగా ఉండాల్సిన సాధనం ఇండోర్ సైకిల్. ఇది మీ ఇంట్లో కొంత స్థలాన్ని ఆక్రమించినప్పటికీ.. గుండె ఆరోగ్యానికి సంబంధించిన వ్యాయామాలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించడం ద్వారా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటమే కాకుండా శరీరంలో ఆక్పిజన్ స్థాయులు పెరుగుతాయి.
పుల్ అప్ బార్స్: శరీరాన్ని బలోపేతం చేసేందుకు పుల్ అప్స్ బాగా ఉపకరిస్తాయి. మొత్తం శరీరాన్ని పైకెత్తే ఈ ప్రక్రియతో శక్తి, ఎక్కువ సమయం పాటు పని చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్