Ap News: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు

ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి 7,400 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కీసర నుంచి మరో 1,200 క్యూసెక్కుల

Updated : 02 Jul 2021 19:15 IST

విజయవాడ: ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజికి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద 3.07 టీఎంసీల పూర్తి నీటి సామర్థ్యం ఉండటంతో ఆ నీటి ప్రవాహాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి ఏడు గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 

ప్రస్తుతం 8,500 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథాగా వదులుతున్నట్టు జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఎగువన పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటంతో 7,200 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజికి వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి 38వేల క్యూసెక్కుల మేర పులిచింతలకు నీటి ప్రవాహాలు వస్తున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 62,446 క్యూసెక్కుల నీరు వస్తోందని ఏపీ జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల్లో పూర్తి నీటి నిల్వలు లేనప్పటికీ విద్యుత్‌ ఉత్పత్తి కారణంగా తెలంగాణ అధికారులు నీటిని దిగువకు వదులుతున్నట్టు స్పష్టం చేశారు. దీంతో సాగు, తాగునీటికి వినియోగించాల్సిన నీరు ప్రకాశం బ్యారేజి నుంచి వృథాగా సముద్రం పాలవుతోందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని