Ap News: 20 గేట్ల ద్వారా సముద్రంలోకి నీరు

ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజికి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీల..

Updated : 03 Jul 2021 15:08 IST

విజయవాడ: ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజికి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. మొత్తం 20 గేట్ల ద్వారా 8,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజిలో ప్రస్తుతం 3.07 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటంతో అదనపు నీటిని నిల్వ చేయలేని పరిస్థితితో సముద్రంలోనికి విడిచిపెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 39,700 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్టు వద్ద తెలంగాణా జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో 7,200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. మరోవైపు నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 62,446 క్యూసెక్కులు, శ్రీశైలం నుంచి 21,229 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని