Food: ఆహారం జీర్ణం అవ్వట్లేదా! కారణాలు ఇవే కావచ్చు!
చాలామంది నచ్చిన ఆహారాన్ని రుచి చూడాలనుకుంటారు. కానీ ప్రస్తుత జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల జీర్ణ వ్యవస్థ చాలా దెబ్బతింటోంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తిన్న ఆహారం జీర్ణం కాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మధ్యాహ్నం తిన్న భోజనం ఇంకా జీర్ణం కాలేదని.. రాత్రి సమయంలో తినకుండా పడుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా! అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? కారణాలేంటి! తెలుసుకోండి.
* ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు జీవనశైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. దీంతో లాభాలతో పాటు నష్టాలూ వెంట వచ్చేశాయి.
* మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2 గంటల లోపే తినేయాలి. ఆలస్యంగా తింటే ఆహారం జీర్ణమవదు. కొంతమంది పనిలో పడి, లేదా బరువు పెరుగుతామనే భయంతో భోజనం చేయటం మానేస్తుంటారు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.
* రాత్రి భోజనం 8 గంటల కల్లా తినేయాలి. తర్వాత కాసేపు నడవాలి. తిన్న వెంటనే నిద్రపోవటం మంచిది కాదు.
* ఉదయం అల్పాహారమైనా, భోజనమైనా సమయానికి తినేయాలి. నిర్ణీత సమయానికి తినడం వల్ల చాలావరకూ సమస్యలను నివారించవచ్చు.
* చాలామంది అర్ధరాత్రి దాటేవరకు సెల్ఫోన్లు, లాప్టాప్లు వాడుతూ ఉంటారు. దీని వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి.
* జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే ఉదయం గోరు వెచ్చిన నీటిని తాగాలి. ఇందులో తేనె, నిమ్మరసం చేర్చుకుంటే మరిన్ని ప్రయోజనాలుంటాయి.
* చాలామంది ఎక్కువగా టీ, కాఫీలు తాగుతుంటారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆహారం తొందరగా జీర్ణమవదు.
* జంక్ ఫుడ్ను తగ్గించండి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. -
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
వైకాపా ప్రచారరథం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
దిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. -
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్
హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.