కీళ్ల నొప్పికి‘ఆహా’ర నియమాలు!
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికే కాదు. వాపు నివారణకూ తోడ్పడతాయి. కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గటానికివి ఎంతగానో
ఆహారమే ఔషధం. అవును. ఆహార నియమాలు పాటిస్తే చాలావరకు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్ఛు ఉప్పు తగ్గిస్తే రక్తపోటు, పిండి పదార్థాలు తగ్గిస్తే మధుమేహం నియంత్రణలో ఉంటాయన్నది తెలిసిందే. కొన్ని జాగ్రత్తలతో నొప్పులనూ.. ముఖ్యంగా కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చన్నది నిపుణుల సూచన.●
* ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల వంటి పాలీ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికే కాదు. వాపు నివారణకూ తోడ్పడతాయి. కీళ్లవాతం బాధితుల్లో నొప్పి తగ్గటానికివి ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాల్మన్ రకం చేపలు, అవిసె గింజలు, ఆలివ్ నూనె వంటి వాటిల్లో ఇలాంటి కొవ్వు ఆమ్లాలు దండిగా ఉంటాయి.
* ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మాదిరిగానే క్యాబేజీ, చిన్న క్యాబేజీ (బ్రసెల్స్ స్ప్రౌట్స్), గోబీ పువ్వు వంటి కూరగాయలూ వాపును తగ్గిస్తాయి. వీటిల్లో వాపును నివారించే గుణాలతో పాటు విటమిన్ సి సైతం ఎక్కువే. ఇదీ కీళ్లవాతం తగ్గటానికి దోహదం చేస్తుంది.
* వాపును ప్రేరేపించే పదార్థాలకు దూరంగా ఉండటమూ అలవరచుకోవాలి. వేట మాంసంలో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ. ఇవి వాపును ప్రేరేపిస్తాయి. వీలైనంతవరకు మాంసం తగ్గించటం మంచిది. చిక్కుళ్లు, పప్పులు, వేరుశనగలు, టమోటాలు, బంగాళాదుంపల్లో లెక్టిన్లు ఎక్కువ. వాపును ప్రేరేపించే వీటిని మితంగా తీసుకోవటం మేలు. శీతల పానీయాలు, పండ్ల రసాలు, మిఠాయిల వంటివీ వాపు ఎక్కువయ్యేలా చేస్తాయి. వీటికి దూరంగా ఉండటం ఉత్తమం.
* ఆహార నియమాలకు వ్యాయామం తోడైతే మరింత మేలు చేస్తుంది. కీళ్లు అరిగిపోయినవారు, ఊబకాయం గలవారు వీటిని పాటిస్తే కీళ్లపై ఒత్తిడి తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల కీళ్ల మీద అంతగా భారం పడని ఈత వంటి వ్యాయామాలతో పాటు ఆహార నియమాలు పాటిస్తుంటే నొప్పుల ఇబ్బందులు లేకుండా హాయిగా గడిపేలా చూసుకోవచ్ఛు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!