Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
వయసులో ఉన్నపుడు రాళ్లను తిన్నా కరిగించుకోవచ్చు. వయసు మళ్లిన తర్వాత రకరకాల సమస్యలు వెంటాడుతుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: వయసులో ఉన్నపుడు రాళ్లను తిన్నా కరిగించుకోవచ్చు. వయసు మళ్లిన తర్వాత రకరకాల సమస్యలు వెంటాడుతుంటాయి. తరచుగా ఆజీర్తి, గ్యాస్ట్రబుల్, పొట్ట ఉబ్బరం, పుల్లటి తేన్పుల లాంటి బాధలు పెరుగుతుంటాయి. వయసుకు తగ్గట్టుగా రోజువారీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వయసు పైబడిన వారు నిత్యం ఏం తినాలో.. ఎలా తినాలో..ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో పోషకాహార నిపుణురాలు అంజలీదేవి పలు సూచనలు చేశారు.
* 60 ఏళ్లు దాటిన తర్వాత ఆహార నియమాలు సరిగా ఉంటే అవే ఔషధాలుగా పని చేస్తాయి. వృద్ధాప్యం 70 ఏళ్ల దాటి పోయినా ఆరోగ్యం ఉన్నా శారీరక మార్పులు మాత్రం జరిగిపోతాయి.
* భోజనంలో ఆకు కూరలు, కూరగాయలు,, పండ్లు సగం పళ్లెం నిండా ఉండాలి. పావువంతు గింజ ధాన్యాలు, ఇంకో పావు భాగంలో మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహార పదార్థాలుండాలి.
* ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూరను 100 మి.గ్రాములు తీసుకోవాలి. ఇందులో ఇనుము, కాల్షియం ఉంటాయి.
* పండ్లలో బీ కాంప్లెక్సు ఎక్కువగా ఉంటాయి. నరాల్లో బలం ఉండేందుకు బాగా ఉపయోగపడుతాయి.
* దుంప కూరలు తక్కువగా తినాలి. గింజ కూరలు తిన్నపుడు వీటిని పూర్తిగా తగ్గించాలి.
* వృద్ధాప్యంలో నాలుకపై రుచి మొగ్గలు తగ్గిపోతాయి. వాసన కూడా సరిగా ఉండదు. ఏ ఆహారం తిన్నా వాసన, రుచి లేకపోవడంతో అసంతృప్తికి లోనవుతారు.
* విటమిన్ డి.కాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పాల పదార్థాలు, చేపలు ఎక్కువగా తీసుకోవాలి.
* పెద్దలకు మలబద్దకం సమస్యగా మారుతుంది. రోజువారీ ఆహారంలో పీచు బాగా లభించే పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం ఎక్కువగా తినాలి.
* ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. డ్రై చేసిన వంటలు తినొద్దు. సమయానుకూలంగా తినాలి. కొద్దిసేపు వ్యాయామం రోజూ చేయాలి.
* దాహం వేయడం లేదని నీరు తాగకుండా ఉండకూడదు. తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?