అధికారులను అడ్డుకున్న కొవిడ్‌ పాజిటివ్ వ్యక్తులు

పోడు భూముల్లో చదును చేస్తున్న డోజర్లను పట్టుకునేందుకు వెళ్ళిన అటవీశాఖ అధికారులను కరోనా పాజిటివ్ వ్యక్తులు అడ్డుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సాంబతండాలో చోటు చేసుకుంది....

Published : 23 Apr 2021 23:08 IST

బయ్యారం: పోడు భూముల్లో చదును చేస్తున్న డ్రోజర్లను పట్టుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను కరోనా పాజిటివ్ వ్యక్తులు అడ్డుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సాంబతండాలో చోటు చేసుకుంది. పోడు భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్నారనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి డ్రోజర్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. కాగా తండా వాసులు అధికారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలంకావడంతో తండాలో ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి హోంఐసోలేషన్‌లో ఉన్న బాధితుల్ని అక్కడకు రప్పించారు. తండావాసుల చర్యలతో ఆందోళనకు గురైన అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని