కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి

బిహార్‌లో కరోనా వైరస్‌ బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరీ మహమ్మారితో పోరాడుతూ సోమవారం మృతి చెందారు.

Published : 19 Apr 2021 11:26 IST

పట్నా: బిహార్‌లో కరోనా వైరస్‌ బారిన పడి మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మాజీ విద్యాశాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరీ మహమ్మారితో పోరాడుతూ సోమవారం మృతి చెందారు. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ‘మేవాలాల్‌ గత వారం కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అప్పటి నుంచి పారాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహమ్మారితో పోరాడుతూ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు’ అని పార్టీ నేతలు తెలిపారు.

బిహార్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేవాలాల్‌ జేడీయూ తరపున తారాపూర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జేడీయూ నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక..  విద్యాశాఖ మంత్రిగా కేబినెట్‌లో ఆయనకు చోటు కల్పించారు. కానీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన నాలుగు రోజులకే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది

కాగా, కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదివారం రాత్రి కర్ఫ్యూ విధించింది. అంతేకాకుండా మే 15 వరకు విద్యాసంస్థలు అన్ని మూసివేసేందుకు నిర్ణయించింది. మరోవైపు సంక్షోభ సమయంలోనూ విధులు నిబద్దతతో నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఒకనెల బోనస్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా బిహార్‌ ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ప్రస్తుతం 39,498 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 1,722 కేసులు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని