హెపటైటీస్ వైరస్ నిర్మూలనే లక్ష్యం!
అత్యంత ప్రమాదకరమైన కాలేయ సంబంధ వ్యాధులకు కారణమవుతున్న హెపటైటీస్ వైరస్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హరియాణాలో ప్రయోగం విజయవంతం కావటంతో అన్ని రాష్ట్రాల్లోనూ చికిత్సను ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్ : అత్యంత ప్రమాదకరమైన కాలేయ సంబంధ వ్యాధులకు కారణమవుతున్న హెపటైటిస్ వైరస్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హరియాణాలో ప్రయోగం విజయవంతం కావటంతో అన్ని రాష్ట్రాల్లోనూ చికిత్సను ప్రారంభించింది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల పరిధిలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందించటానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్సా కేంద్రం ప్రారంభించారు.
2030 నాటికి కాలేయ వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ పేరుతో రోగులకు వ్యాధి నయం చేయటమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, తిరుపతిలో ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిల్లో మోడల్ ట్రీట్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రుయా ఆసుపత్రిలో ప్రతీ మంగళ, గురువారాల్లో రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నారు.
నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ కార్యక్రమం ద్వారా రోగులకు ఖరీదైన ఔషధాలు, వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా లభించనున్నాయి. హెపటైటిస్ను ప్రారంభంలోనే గుర్తించకపోతే రోగుల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. కేవలం మూడు నెలల వైద్యంతో హెపటైటిస్ సీ పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న ఈ పథకం ద్వారా హెపటైటిస్ రోగులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?