హెపటైటీస్‌ వైరస్‌ నిర్మూలనే లక్ష్యం! 

అత్యంత ప్రమాదకరమైన కాలేయ సంబంధ వ్యాధులకు కారణమవుతున్న హెపటైటీస్‌ వైరస్‌ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హరియాణాలో ప్రయోగం విజయవంతం కావటంతో అన్ని రాష్ట్రాల్లోనూ చికిత్సను ప్రారంభించింది.

Updated : 31 Dec 2020 23:00 IST

 

 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : అత్యంత ప్రమాదకరమైన కాలేయ సంబంధ వ్యాధులకు కారణమవుతున్న హెపటైటిస్‌ వైరస్‌ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హరియాణాలో ప్రయోగం విజయవంతం కావటంతో అన్ని రాష్ట్రాల్లోనూ చికిత్సను ప్రారంభించింది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల పరిధిలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందించటానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్సా కేంద్రం ప్రారంభించారు.

2030 నాటికి కాలేయ వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ వైరల్ హెపటైటిస్‌ కంట్రోల్ ప్రోగ్రామ్ పేరుతో రోగులకు వ్యాధి నయం చేయటమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, తిరుపతిలో ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిల్లో మోడల్‌ ట్రీట్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రుయా ఆసుపత్రిలో ప్రతీ మంగళ, గురువారాల్లో రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నారు.

నేషనల్ వైరల్ హెపటైటిస్‌ కంట్రోల్‌ కార్యక్రమం ద్వారా రోగులకు ఖరీదైన ఔషధాలు, వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా లభించనున్నాయి. హెపటైటిస్‌ను ప్రారంభంలోనే గుర్తించకపోతే రోగుల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. కేవలం మూడు నెలల వైద్యంతో హెపటైటిస్‌ సీ పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న ఈ పథకం ద్వారా హెపటైటిస్‌ రోగులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని