Gems: ఎట్టకేలకు ఆ భారత నిధిని వారు అలా పంచుకున్నారు!
ఫ్రాన్స్లోని మోంట్ బ్లాంక్ అనే హిమనీనదంలో దశాబ్దాలుగా కూరుకుపోయి ఉన్న ఓ విలువైన నిధిని ఎవరికి ఇవ్వాలనే వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది....
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్లోని మోంట్ బ్లాంక్ అనే హిమానీనదంలో దశాబ్దాలుగా కూరుకుపోయి ఉన్న ఓ విలువైన నిధిని ఎవరికి ఇవ్వాలనే వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. వాటిని కనిపెట్టిన పర్వతారోహకుడు, స్థానిక ప్రభుత్వానికి మధ్య దాన్ని సమానంగా పంచారు. ఇంతకీ అందులో ఏమున్నాయి? ఆ కథేంటో చూద్దాం!
2013లో ఓ పర్వతారోహకుడు మోంట్ బ్లాంక్ను అధిరోహిస్తుండగా.. అతనికి ఓ లోహపు పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి చూస్తే అందులో విలువైన పచ్చలు, కెంపులు, నీలమణి నిధి ఉంది. నిజాయతీగా వ్యవహరించిన అతడు వాటిని స్థానిక పోలీసులకు అందజేశాడు. అప్పటి నుంచి వాటిని ఎవరికి అప్పజెప్పాలనే విషయంపై వివాదం కొనసాగుతోంది. ఎట్టకేలకు స్థానిక ప్రభుత్వం, ఆ పర్వతారోహకుడి మధ్య సమానంగా పంచాలన్న నిర్ణయంతో సమస్య పరిష్కారమైంది. ఈ నిర్ణయంతో పర్వతారోహకుడు సైతం సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే స్థానిక పట్టణ మేయర్ ఎరిక్ ఫౌర్నియర్ పర్వతారోహకుడి నిజాయతీని ప్రశంసించారు. ఆ నిధి విలువ రూ.1.27 కోట్లు.
ఆ నిధి ఎక్కడిది?
ఆ విలువైన రాళ్లు భారత్కు చెందినవే. 1950, 1966లో ఎయిరిండియాకు చెందిన రెండు విమానాలు మోంట్ బ్లాంక్ పర్వతాల్లో కుప్పకూలాయి. వీటిలో ఏదో ఒక దానిలో ప్రయాణిస్తున్న వారికి చెందినవే అయి ఉంటాయని భావిస్తున్నారు. బహుశా 1966లో ముంబయి నుంచి న్యూయార్క్కు బయలుదేరిన విమానంలోని వారివే అయి ఉంటాయని కొన్ని ఆధారాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో మావన అవశేషాలు, విమాన శకలాలు పర్వతారోహకుల కంట పడుతుంటాయి. 2012లో ఓ దౌత్యసంబంధమైన సమాచారంతో పాటు వ్యక్తిగత సందేశం ఉన్న సంచిని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
ఆయన ఆ విమానంలోనే ఉన్నారు..
భారత అణుపితామహుడిగా పేరొందిన హోమీ జహంగీర్ బాబా 1966లో మోంట్ బ్లాంక్లో కుప్పకూలిన విమాన ప్రమాదంలోనే మరణించారు. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 117 మంది అక్కడే దుర్మరణం చెందారు. సమీపంలోని జెనీవా విమానాశ్రయం, పైలట్ మధ్య అవగాహనా లోపం వల్లే ఆ ప్రమాదం జరిగిందని అధికారికంగా ప్రకటించారు. కానీ, ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. దీని వెనుక అమెరికా సీఐఏ హస్తం ఉందని ప్రచారం జరిగింది. భారత అణుకార్యక్రమాన్ని దెబ్బతీయడానికే ఇలా చేసి ఉంటారని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. తర్వాత గ్రెగరీ డగ్లస్ అనే జర్నలిస్టు ఈ వివాదంపై ‘కన్వర్జేషన్స్ విత్ క్రో’ అనే పుస్తకం రాశారు. సీఐఏలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారి రాబర్ట్ క్రోలీతో దాదాపు 4 సంవత్సరాల పాటు జరిపిన సంభాషణల ఆధారంగా ఆయన పుస్తకాన్ని రచించారు. హోమీ జహంగీర్ బాబాను అంతమొందించడానికే సీఐఏ ఈ కుట్ర పన్నినట్లు సంభాషణల్లో క్రోలీ చెప్పినట్లు పుస్తకంలో డగ్లస్ పేర్కొన్నారు. కార్గోలో బాంబును అమర్చి మార్గమధ్యంలో పేల్చారని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్