Telangana News: కొడుకు గంజాయి తీసుకున్నాడని.. స్తంభానికి కట్టేసి, కళ్లలో కారం పోసిన తల్లి
కన్న కొడుకు మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు.. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మాట వినలేదు. ఎం చెయ్యాలో పాలుపోని ఆ తల్లికి ఓపిక నశించింది.. కన్న కొడుకు జీవితం నాశనం
కోదాడ: కన్న కొడుకు మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు.. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మాట వినలేదు. ఏం చెయ్యాలో పాలుపోని ఆ తల్లికి ఓపిక నశించింది.. కన్న కొడుకు జీవితం నాశనం కాకూడదన్న ఆలోచనతో కాస్త కఠినంగా వ్యవహరించింది. కొడుకును స్తంభానికి కట్టేసి కళ్లలో కారం పోసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన 15 సంవత్సరాల బాలుడు పాఠశాలకు వెళ్లకుండా మత్తు పదార్థాలకి బానిసయ్యాడు. చెడు అలవాట్లు.. చెడు స్నేహితుల కారణంగా గంజాయి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు.. వ్యసనానికి గురైన బాలుడు.. అతని తల్లి ఎంత చెప్పినా వినలేదు. కళ్ల ముందే కొడుకు చెడుపోతున్నా తల్లిదండ్రులు ఏమీ చేయలేని పరిస్థితి.. రోజూ మత్తుతో ఇంటికి వచ్చిన కొడుక్కి మంచి మాటలు చెప్పినా వినకపోవడంతో ఆగ్రహించిన తల్లి.. కొడుకును స్తంభానికి కట్టేసింది. ఎలాగైనా కొడుకును దారికి తేవాలని కన్నీళ్లు దిగమింగుతూ కళ్లలో కారం పోసి దేహశుద్ధి చేసింది. మత్తు పదార్థాలు మానేస్తానని కొడుకు మాట ఇవ్వడంతో ఆ తల్లి శాంతించింది. కొడుకుకు స్నానం చేయించి.. చికిత్స అందించి గుండెలకు హత్తుకుంది. ఈ సన్నివేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తల్లి చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. కొడుకును మంచి మార్గంలో పెట్టాలని ప్రయత్నించిన తల్లి.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చెడు అలవాట్లపై అవగాహన కల్పించాలని ఆ తల్లి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కోదాడలో విచ్చలవిడిగా గంజాయి..
మరోవైపు కోదాడ పట్టణం రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటంతో అక్కడి యువత పెద్ద మొత్తంలో గంజాయి వినియోగిస్తున్నారు. కోదాడ పట్టణంలోనే ఇప్పటివరకు పలు గంజాయి కేసులు నమోదు అయ్యాయి. పలువురికి కౌన్సెలింగ్ ఇవ్వగా, కొంత మంది జైలుకు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్