AP News: పెట్రో మంట.. గుర్రంపై ప్రయాణం

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి తప్పించుకునేందుకు ఓ తాపీమేస్త్రి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురం గ్రామానికి చెందిన హనుమంత రాయుడు....

Published : 19 Jul 2021 01:06 IST

మల్లాపురం: రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి తప్పించుకునేందుకు ఓ తాపీమేస్త్రి వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురం గ్రామానికి చెందిన హనుమంత రాయుడు తన టీవీఎస్ వాహనాన్ని పక్కన పెట్టి.. గుర్రంపై ప్రయాణం సాగిస్తున్నాడు. పెరిగిన ధరల కారణంగా వచ్చే ఆదాయంలో సగం పెట్రోల్ ఖర్చుకే పోవడంతో.. వాహనాన్ని నడపలేక రూ.12 వేలకు ఒక గుర్రాన్ని కొనుగోలు చేశాడు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా పనులు చేసే హనుమంతరాయుడు.. అక్కడికి ఈ గుర్రంపైనే వెళ్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు. వాహనానికయ్యే పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే ఈ గుర్రం నిర్వహణకు పెట్టే ఖర్చు చాలా తక్కువే అంటున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని