AP News: వరదలో అంతిమయాత్ర.. వీడియో

చిత్తూరు జిల్లా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగగా..

Updated : 24 Nov 2022 16:21 IST

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. మూగజీవాలు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. జిల్లాలోని ఏర్పేడు మండలం కొత్త వీరాపురంలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహించడంతో ఓ వ్యక్తి అంత్యక్రియల నిర్వహణ కోసం బంధువులు తీవ్ర అవస్థలు పడ్డారు. శ్మశానవాటిక నీట మునగడంతో గంగాధర్‌ అనే వ్యక్తి మృతదేహాన్ని స్వర్ణముఖి నది వరదలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. వర్షా కాలంలో శ్మశానవాటిక కష్టాలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని