కేరళలో కూలిన తాత్కాలిక గ్యాలరీ.. 200 మందికి గాయాలు!

కేరళలోని మలప్పురం పరిధి పూన్‌గోడ్‌లో విషాదం చోటుచేసుకుంది.

Updated : 20 Mar 2022 12:58 IST

మలప్పురం: కేరళలోని మలప్పురం పరిధి పూన్‌గోడ్‌లో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి సుమారు 200 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వర్షం కురవడం.. అప్పటికే పరిమితికి మించి ప్రేక్షకులు ఉండటంతో గ్యాలరీ కూలినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని