Ganesh immersion: తొలిసారి పీవీ మార్గ్లోనూ గణేశ్ నిమజ్జనాలు: సీపీ అంజనీ కుమార్
గణేష్ నిమజ్జనం రోజున బందోబస్తు ఏర్పాట్లు, రూట్ మ్యాప్నకు సంబంధించిన బుక్లెట్ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విడుదల చేశారు. నగరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం రోజు బందోబస్తు ఏర్పాట్లు, రూట్ మ్యాప్నకు సంబంధించిన బుక్లెట్ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విడుదల చేశారు. నగరంలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘గతేడాది కరోనా వల్ల గణేశ్ ఉత్సవాలు జనసందోహం మధ్య జరగలేదు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ప్రజలు నిమజ్జనంలో పాల్గొననున్నారు. హుస్సేన్సాగర్తోపాటు నగరంలోని పలుచోట్ల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొలిసారిగా పీవీ మార్గ్లో కూడా నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశాం. దాదాపు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బలగాలు ఈ బందోబస్తులో పాల్గొననున్నాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వజ్ర వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. గణపతి విగ్రహాలకు జియో ట్యాగింగ్, దాదాపు 9వేల విగ్రహాలకు బార్ కోడ్ ఇచ్చాం. నాలుగు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలు నగరంలో 40 వేల వరకు ఉండొచ్చు. నిమజ్జనానికి 55 క్రేన్లు ఉపయోగిస్తున్నాం. హైదరాబాద్ కమిషనరేట్లో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం. అన్ని శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తారు. బస్టాండ్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, జన సమూహ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాం. మహిళల భద్రత కోసం షీ టీమ్ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు 17 కిలోమీటర్ల మేర గణేశ్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేశారు’’ అని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్