రోడ్డెక్కిన గన్నవరం వైకాపా
గన్నవరం నియోజకవర్గం వైకాపాలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో..
బాపులపాడు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న వైకాపా శ్రేణులు
హనుమాన్జంక్షన్ గ్రామీణం: గన్నవరం నియోజకవర్గం వైకాపాలో వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో సోమవారం బాపులపాడు మండల పరిషత్తు కార్యాలయం వద్ద వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాకులపాడు, వీరవల్లి సచివాలయ భవన నిర్మాణాలకు సంబంధించిన పనుల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ దుట్టా, యార్లగడ్డ వర్గాలకు చెందిన నాయకులు ధర్నా నిర్వహించారు. తొలుత నిర్మాణ పనుల బాధ్యత తమకు అప్పగించారని, ఎమ్మెల్యే కూడా తమతోనే పూజలు చేయించారని, తీరా ప్రస్తుతం వేరేవాళ్లకు కట్టబెట్టారని సూరపనేని రాధాకృష్ణమూర్తి, వెలగపూడి శేషగిరిరావు, కాలి రమేష్, వైవీ రంగారావు తదితరులు ఆరోపించారు. తమను ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తూ, వేధింపులకు గురి చేస్తున్నారంటూ, వంశీ డౌన్ డౌన్, వంశీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పార్టీ పెద్దలు వైవీ సుబ్బారెడ్డి దృష్టికి సమస్య తీసుకెళ్లినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాకతో పార్టీ కోసం పదేళ్ల పాటు కష్టపడి పనిచేసిన వారికి తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గమనించాలని సూచించారు. వ్యవహారం తేలేవరకు పనులు ఆపేయాలని ఎంపీడీవో కేశవరెడ్డిని డిమాండ్ చేశారు. ఆ అధికారం తనకు లేదని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇదే విషయమై కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. చిన్నాల లక్ష్మీనారాయణ, ఆళ్ల గోపాలకృష్ణ, బొడ్డు జగన్, ప్రసాద్పాల్, సదర్ల కిశోర్, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు వంశీ వర్గీయులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ, కాకులపాడు సచివాలయ నిర్మాణ పనులు మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులకే అప్పగించారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు