Siddipet: గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్న నిర్వాసితులు

సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను గుడాటిపల్లి భూనిర్వాసితులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.

Published : 23 Dec 2021 15:10 IST

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులను గుడాటిపల్లి భూనిర్వాసితులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. నష్టపరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టు పనులను చేయడానికి వీల్లేదంటూ పెద్దసంఖ్యలో గ్రామస్థులు తరలి వచ్చారు. ప్రాజెక్టు పనులు అడ్డుకోవద్దంటూ పోలీసులు నచ్చచేప్పే ప్రయత్నం చేసిన గ్రామస్థులు వినకపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిహారం అందిన తర్వాతే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అప్పటివరకు అక్కడ నుంచి కదలేది లేదంటూ బైఠాయించారు.

Read latest General News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని