
Published : 02 Jan 2020 11:53 IST
దిల్లీ మెట్రో రైళ్లలో ఉచిత వైఫై..!
దిల్లీ: నేటి నుంచి దిల్లీ మెట్రో రైళ్లల్లో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. దిల్లీ ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ లైన్ మెట్రోలో దీనిని అందుబాటులోకి తెచ్చారు. దిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ తొలిసారి రైళ్లలో దీనిని ప్రారంభించింది. సంస్థ ఎండీ మంగు సింగ్ ఈ సేవలను ప్రారంభించారు.
దిల్లీ మెట్రో ఎయిర్పోర్టు లైన్ మొత్తం ఆరు స్టేషన్లతో 22 కిలోమీటర్ల పొడవునా ఉంది. దిల్లీ ఎయిర్పోర్టు మెట్రోలైన్ను 2011లో ప్రారంభించారు. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ భాగస్వామ్యంతో దీనిని నిర్మించారు. 2013 రిలయన్స్ ఇన్ఫ్రా దీని నుంచి వైదొలగ్గా.. డీఎంఆర్సీ పూర్తి వాటాను సొంతం చేసుకొంది. ఎయిర్పోర్టు లైన్లోని ఆరు మెట్రోస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
Tags :