ముఖం చూసి పాస్పోర్టు నిరాకరించారు!
హరియాణాలో పాస్పోర్టు కోసం ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లిన ఇద్దరు సోదరీమణులకు వింత అనుభవం ఎదురైంది. వారిద్దరు చూడటానికి నేపాలీలుగా ఉన్నారని అధికారి పాస్పోర్టు జారీ చేసేందుకు తిరస్కరించడంతో వారు ఆందోళనకు గురయ్యారు.
ఛండీగఢ్: హరియాణాలో పాస్పోర్టు కోసం ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లిన ఇద్దరు సోదరీమణులకు వింత అనుభవం ఎదురైంది. వారిద్దరు చూడటానికి నేపాలీలుగా ఉన్నారని అధికారి పాస్పోర్టు జారీ చేసేందుకు తిరస్కరించడంతో వారు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. హీనా (26), సంతోష్(29) అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఇటీవల పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు వెరిఫికేషన్ అనంతరం అంబాలాలోని పాస్పోర్టు కేంద్రం అధికారులు వారిని ఛండీగఢ్ కార్యాలయానికి వెళ్లమని సూచించారు. దీంతో అక్కడికి వెళ్లిన వారిద్దరినీ ఓ అధికారి చూసి నేపాలీల్లా ఉన్నారంటూ.. భారత పౌరసత్వం పత్రాల కోసం జిల్లా కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించాలని సూచించారట. కనీసం వారు వెంట తెచ్చిన ఆధార్, ఓటరు కార్డు పత్రాలను సైతం చూడలేదట. అంతేకాకుండా వారిద్దరూ చూడటానికి నేపాలీలుగా ఉన్నారని ఆ అధికారి వారి దస్త్రాలపై రాసినట్లు అక్కాచెల్లెళ్లు తెలిపారు.
అంబాలా డిప్యూటీ కమిషనర్ అశోక్శర్మ దీనిపై స్పందిస్తూ.. పాసుపోర్టు విషయంలో వీరికి జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిందని.. రెండు రోజుల తర్వాత వారిద్దరినీ ఛండీగఢ్ ఆర్పీవో కార్యాలయానికి వెళ్లమని సూచించాం. కొద్ది రోజుల్లో వారు పాస్పోర్టులు పొందుతారని తెలిపారు. అదేవిధంగా ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీనా.. ‘మా తాత నేపాల్ నుంచి వచ్చారు. మా నాన్నతో సహా మేము ఇక్కడే జన్మించాం’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203