కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి సర్వర్ షాక్!
హోటల్లో మనం ఏదైనా తిన్న తర్వాత అక్కడి సిబ్బందికి టిప్ ఇవ్వడం తెలిసిందే. మనకు సర్వ్ చేసినందుకు కృతజ్ఞతగా ఎంతో కొంత వారి చేతిలో పెడతాం. అయితే ఎవరూ ఊహించని విధంగా బిల్లు కంటే అధికంగా..
మిషిగన్ : హోటల్లో మనం ఏదైనా తిన్న తర్వాత అక్కడి సిబ్బందికి టిప్ ఇవ్వడం తెలిసిందే. మనకు సర్వ్ చేసినందుకు కృతజ్ఞతగా ఎంతో కొంత వారి చేతిలో పెడతాం. అయితే ఎవరూ ఊహించని విధంగా బిల్లు కంటే అధికంగా.. దాదాపు వంద రెట్లు ఎక్కువగా టిప్ చెల్లించడం ఎక్కడైనా చూశారా.. ఇలాంటి ఘటనే మిషిగన్లో చోటుచేసుకుంది. అంత భారీ మొత్తంలో టిప్ అందుకున్న ఓ హోటల్ సర్వర్ ఆశ్చర్యంతో కాసేపు షాక్కు గురయ్యారు కూడా.
మిషిగన్ అల్పేనాలోని థండర్ బే రివర్ రెస్టారెంట్లో డేనియల్ ఫ్రాంజోని పని చేస్తున్నారు. ఆదివారం ఓ కస్టమర్ ఆ హోటల్కి వచ్చాడు. తాను తిన్నవాటికి 23 డాలర్లు(రూ.1,650) చెల్లించాడు. అతడు చెల్లించిన క్రెడిట్ కార్డు రిసిప్ట్ చూసి డేనియల్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే దానిపై 2020 డాలర్ల(రూ.1.45 లక్షలు) టిప్ అని పేర్కొని ఉంది. దానిపై ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘2020 టిప్ ఛాలెంజ్’ అని కూడా రాసి ఉంది. దీన్ని చూసిన ఆ సేవకురాలు తన కళ్లను తానే నమ్మలేకపోయింది. వెంటనే తన మేనేజర్ వద్దకు వెళ్లి ఇది నిజమేనా అని అడిగింది. అదంతా నిజమే.. ఆ సొమ్మంతా నీదే అని మేనేజర్ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ ‘ఇలాంటివి నాలాంటి వారికి జరగవు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ మొత్తంలో కొంత తన డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం వినియోగిస్తానని.. మిగతాది దాచుకుంటానని చెప్పింది. అనంతరం ఆమె హోటల్లో తిని తనకు వడ్డించిన సర్వర్కు 20.20 డాలర్లను టిప్గా ఇవ్వడం విశేషం.
‘2020 టిప్ ఛాలెంజ్’..
అయితే ఇదంతా కొత్త సంవత్సరం సందర్భంగా ‘2020 టిప్ ఛాలెంజ్’లో భాగంగా జరుగుతోంది. పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్లో పాల్గొంటూ 2020 డాలర్లను టిప్పుగా చెల్లిస్తూ సర్వర్లను ఆశ్చర్యపరుస్తున్నారు. అమెరికన్ సింగర్ డానీ వాల్బెర్గ్ కొత్త సంవత్సరం రోజున తన భార్యతో ఓ రెస్టారెంట్కు వెళ్లి 78 డాలర్ల బిల్లుకు 2020 టిప్గా చెల్లించి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు.
అయితే గతంలో ఇలాంటి ఛాలెంజే ఒకటి నడిచింది. 2018లో ‘టిప్ ద బిల్’ పేరిట తాము చెల్లించిన బిల్లులో 100 శాతం టిప్పుగా ఇచ్చి సర్వర్లను అప్పట్లో సెలబ్రిటీలు ఆశ్చర్యపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!