ఈటీవీ భారత్‌ ప్రధాన కార్యాలయానికి రజనీ

ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈటీవీ భారత్‌ ప్రధాన కార్యాలయాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  సందర్శించారు. అన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లీషులోనూ...

Published : 06 Jan 2020 01:27 IST

హైదరాబాద్‌: ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈటీవీ భారత్‌ ప్రధాన కార్యాలయాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌  సందర్శించారు. అన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లీషులోనూ వార్తలందిస్తున్న ఈటీవీ భారత్‌ మొబైల్‌ యాప్‌ విశేషాలను రజనీకాంత్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈటీవీ భారత్‌ 29 రాష్ట్రాల న్యూస్‌ డెస్క్‌లను ఆయన తిలకించారు. దేశంలోనే అతిపెద్ద రిపోర్టింగ్‌ నెట్‌వర్క్‌ ఉన్న ఈటీవీ భారత్‌ యాప్‌ను సూపర్‌స్టార్‌ అభినందించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ సినిమా షూటింగ్‌ నిమిత్తం వచ్చిన ఆయన.. ఈటీవీ భారత్‌ మొబైల్‌ యాప్ అందిస్తున్న సేవలను విని.. స్వయంగా చూడాలని కార్యాలయానికి వచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని