టెహ్రాన్లో కూలిన విమానం
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 180 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమైనీ
ఇరాన్ : ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 176 మంది ప్రయాణికులు, సిబ్బందితో కీవ్ వెళ్తున్న ఉక్రెయిన్ అంతర్జాతీయ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. టెహ్రాన్లోని ఇమామ్ ఖొమైనీ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా విమానంలో ఉన్న 176 మంది సజీవదహనమైనట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. మృతుల్లో 167 మంది ప్రయాణికులు కాగా.. 9 మంది సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన కొద్ది క్షణాల్లోనే దానికి రాడార్తో సంబంధాలు తెగిపోయినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ వెంటనే విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ఇరాన్ మీడియా చెబుతోంది.
విమానం కూలిపోయిన దృశ్యాలను కొందరు నెటిజన్లు సోషల్మీడియాలో పోస్టు చేశారు. గాల్లో ఉండగానే విమానానికి నిప్పంటుకున్నట్లు వీడియో ఫుటేజ్లో తెలుస్తోంది. ఘటనలో విమానం పూర్తిగా కాలిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదంపై బోయింగ్ సంస్థ స్పందించింది. ఇరాన్ మీడియా కథనాల ద్వారా ప్రమాదం గురించి తెలుసుకున్నామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ప్రమాదాన్ని ఉక్రెయిన్ కూడా ధ్రువీకరించింది. ఘటనలో విమానంలోని వారంతా మృతిచెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్మీడియా వేదికగా వెల్లడించారు.
కాగా.. ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన కొద్ది గంటలకే ఈ విమాన ప్రమాదం జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ విమానాన్ని ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రమాదవశాత్తూ కూల్చి ఉండొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?