శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు

నగరంలోని శిల్పారామంలో ముప్పవరపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి,

Updated : 09 Jan 2020 22:11 IST

హైదరాబాద్‌: నగరంలోని శిల్పారామంలో ముప్పవరపు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్‌, దత్తాత్రేయ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ సుజనాచౌదరి, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, సినీ ప్రముఖులు మహేశ్‌బాబు, వెంకటేశ్‌, రాఘవేంద్రరావు, సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌, తనికెళ్ల భరణి, జొన్నవిత్తుల తదితరులు హాజరయ్యారు. ఫౌండేషన్‌ తరఫున వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మన సంస్కృతిలో భాగమైన పండుగలను మరవకూడదన్నారు. అమృతం వంటి అమ్మ భాష తెలుగును మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని